న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్రైవేటు సెక్రట‌రీకి .. కేబినెట్ హోదా

న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్రైవేటు సెక్రట‌రీకి ..  కేబినెట్ హోదా

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒక రోజు తరువాత  ఐఏఎస్ ఆఫీస‌ర్ వీకే పాండియ‌న్ కు ఒడిశా ప్రభుత్వం కేబినేట్ ర్యాంకు హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఆయన్ను   ఒడిశా ప్రభుత్వంలో 5T (ట్రాన్స్‌ఫార్మేషనల్ ఇనిషియేటివ్స్) నబిన్ ఒడిశా  ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇన్ని రోజులు ఒడిశా ముఖ్యమంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్రయివేటు సెక్రట‌రీగా కొనసాగిన  పాండియ‌న్  స్వచ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు . ఆయన వాలంట‌రీ రిటైర్‌మెంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తమిళనాడుకు చెందిన   ఒడిశాకు కేడ‌ర్‌కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.   పాండియన్ 2002లో కలహండిలోని ధర్మగర్ సబ్-కలెక్టర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 

2005లో మయూర్‌భంజ్ కలెక్టర్‌గా నియమితుడయ్యారు. ఆ తరువాత  2007లో గంజాం కలెక్టర్‌గా పనిచేశారు. గంజాంలో పోస్టింగ్‌లో ఉన్న సమయంలోనే ఆయన సీఎం నవీన్ పట్నాయక్ కు  నమ్మకమైన అధికారి అయ్యారు. పాండియన్ 2011లో ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరారు.. ఈ తర్వాత ఆయన పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీగా పదోన్నతి పొందారు. 

ALSO READ :- దంచవే మేనత్త పాట తీసేసి..మళ్ళీ కలిపారు..ఎందుకో తెలుసా?