ఫేక్ సర్వేలతో కాంగ్రెస్ గెలుపు ఆపలేరు: జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్

ఫేక్ సర్వేలతో కాంగ్రెస్ గెలుపు ఆపలేరు: జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, వెలుగు: ఫేక్ సర్వేలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించినా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. 

ఆదివారం మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఎర్రగడ్డ, వెంగళరావు నగర్​లో ఇంటింటి ప్రచారం చేశారు. మైనంపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ అంటేనే పేదల ప్రజల ప్రభుత్వమని, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.