సిద్ధూ.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్

సిద్ధూ.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాం పెయినర్లలో నవజ్యోత్​స ింగ్ సిద్ధూ ఒకరని పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇంచార్జి ఆశా కుమారి చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆయన ప్రచారం చేస్తారని అన్నారు . మాజీ క్రికెటర్ గా, కాంగ్రెస్ నేతగా, పంజాబ్ మంత్రిగా సిద్ధూకు ఆడియన్స్​తో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు . 2014 ఎన్నికల ప్రచారంలో సిద్ధూ చాలా కష్టపడ్డారని ఆశాకుమారి చెప్పారు. ప్రచార సభల్లో మాట్లాడి, మాట్లాడి ఆయన గొంతు దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేశారు. డాక్టర్లు రెస్ట్​తీసుకోవాలని చెప్పినా ఆయన ప్రచారంలో పాల్గొన్నారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో మోడీ సర్కారు పాలన వైఫల్యా లను ఎండగడతామని ఆశా చెప్పారు. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన తీరునూ ప్రజల ముందుకు తీసుకెళతామన్నారు . పంజాబ్ సర్కార్ పై వస్తున్న విమర్శలను ఆశా తిప్పికొట్టారు.