కశ్మీర్‌‌లో బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి తమ్ముడు

కశ్మీర్‌‌లో బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి తమ్ముడు

జమ్మూకశ్మీర్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. అక్కడ ప్రధాన పార్టీల నుంచి హిందూ నేతలపై ఫోకస్ చేసింది బీజేపీ. అందులో భాగంగానే... నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత దేవేందర్ సింగ్ రాణా బీజేపీలో చేరారు. దేవేందర్ సింగ్ రాణా... జమ్మూ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్ కు ప్రధాన నాయకుడు. అలాగే NCకి చేరిన మరో సీనియర్ నేత సుర్జిత్ సింగ్ స్లాతియా కూడా బీజేపీలో చేరారు.  ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, హర్ దీప్ సింగ్ పురి, ధర్మేంద్ర ప్రధాన్ లు దేవేందర్ రాణా, సుర్జిత్ సింగ్ లకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. జమ్మూ నుంచి కేంద్రమంత్రిగా బీజేపీలో చక్రం తిప్పుతున్న జితేందర్ సింగ్ తమ్ముడే దేవేందర్ రాణా.