పాకిస్థాన్ కు అక్రమంగా ట్రమడాల్ డ్రగ్

పాకిస్థాన్ కు అక్రమంగా ట్రమడాల్ డ్రగ్

హైదరాబాద్ నుంచి పాకిస్థాన్ కు అక్రమంగా ట్రమడాల్ డ్రగ్ ఎగుమతిని బెంగళూరు NCB అధికారులు అడ్డుకున్నారు. డ్రగ్ ఎక్స్ పోర్టు చేస్తున్న ఫార్మా కంపెనీ డైరక్టర్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. నొప్పి నివారణ కోసం వినియోగించే ట్రమడాల్ డ్రగ్ ను ఎటువంటి అనుమతి లేకుండా పాకిస్థాన్ కు ఎగుమతి చేస్తున్నట్లు NCB గుర్తించింది. సంగారెడ్డి జిల్లాలోని ల్యూసెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ డ్రగ్ ను తరలించినట్లు  NCB అధికారులు తెలిపారు. గతేడాది 25 వేల కిలోల ట్రమడాల్ డ్రగ్ ను ల్యూసెంట్ కంపెనీ ఎగుమతి చేసిందన్నారు.