
- బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు : మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. అధికారిక ప్రోగ్రామ్లలో కేటీఆర్ రాజకీయాలు మాట్లాడడాన్ని ఆయన తప్పుపట్టారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మోదీ సారీ చెప్పాలని కేటీఆర్ అనడంపై ఫైర్ అయ్యారు. ఆ విషయానికి వస్తే రాష్ట్ర ప్రజలకు ముందుగా మీరు, మీ నాయన సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేశారని, దీనికి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు షాక్ ఖాయమని ప్రభాకర్ అన్నారు.