బిహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. 38 జిల్లాల్లోని 46 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. బీహార్ ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
పోస్టల్ బ్యాలెట్ లో 63 స్థానాల్లో ఎన్డీయే మిత్రపక్షాలు, 34 స్థానాల్లో మహాఘట్ బంధన్ ముందంజలో ఉన్నాయి. రెండు స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ లీడ్లో ఉంది. అలీపూర్లో ముందంజలో మైథీలీ ఠాకూర్ లీడ్లో ఉన్నారు. తారాపూర్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ మౌర్య, రాఘోపూర్లో తేజస్వి యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
