ములుగు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ములుగు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ములుగు జిల్లా మంగపేట మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నికీలల ధాటికి శనిగకుంటలో దాదాపు 20 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. సాయంత్రం సమయంలో ఈదురుగాలులకు సమీప అటవీప్రాంతం నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు ఇండ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. కట్టుబట్టలతో పిల్లలను తీసుకుని బయటకు రావడంతో బోరున విలపిస్తున్నారు. వంట సామాగ్రి, విలువైన వస్తులు తమ కళ్లముందే అగ్నికి ఆహుతవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అసలుఅగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

చిరుమర్తి నర్సింహకు నివాళులర్పించిన కేసీఆర్

దేశానికి కావాల్సింది ఫ్రంట్లు​ కాదు..కొత్త ఎజెండా