టార్గెట్ గోల్డ్ మెడల్.. నీరజ్‌‌‌‌ vs వెబర్‌‌‌‌

టార్గెట్ గోల్డ్ మెడల్.. నీరజ్‌‌‌‌ vs  వెబర్‌‌‌‌

పారిస్‌‌‌‌: ఇండియా టాప్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా.. ఈ సీజన్‌‌‌‌లో తొలి ప్రధాన టైటిల్‌‌‌‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు జరిగే పారిస్‌‌‌‌ డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. జర్మన్‌‌‌‌ స్టార్‌‌‌‌ జూలియన్‌‌‌‌ వెబర్‌‌‌‌, అండర్సన్‌‌‌‌ పీటర్స్‌‌‌‌ (గ్రెనెడా) నుంచి నీరజ్‌‌‌‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ పోటీల్లో పాల్గొంటున్న వారిలో ఐదుగురు ఇప్పటికే 90 మీటర్ల మార్క్‌‌‌‌ను క్రాస్‌‌‌‌ చేయడంతో పోటీ చాలా ఎక్కువగా ఉండనుంది. 

దోహా టోర్నీలో చోప్రా 90.23 మీటర్ల దూరం విసిరితే వెబర్‌‌‌‌ తన చివరి ప్రయత్నంలో 91.06 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు. మే 23న పోలాండ్‌‌‌‌లో జరిగిన జానుస్జ్‌‌‌‌ కుసోస్కిని మెమోరియల్‌‌‌‌ టోర్నీలోనూ వెబర్‌‌‌‌.. చోప్రాను ఓడించాడు. ఇక ఈ రెండు టోర్నీల్లోనూ పీటర్స్‌‌‌‌ మూడో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. గతేడాది ఒలింపిక్‌‌‌‌ నేపథ్యంలో నీరజ్‌‌‌‌ ఈ డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌లో బరిలోకి దిగలేదు. 2017లో చివరిసారి ఇక్కడ పోటీపడినప్పుడు 89.45 మీటర్ల దూరంతో సిల్వర్‌‌‌‌ను నెగ్గాడు. జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా పారిస్‌‌‌‌ లీగ్‌‌‌‌లో బరిలోకి దిగి 84.67 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. జూలియస్‌‌‌‌ యెగో(కెన్యా), కెషోర్న్‌‌‌‌ వాల్కాట్‌‌‌‌ (ట్రినిడాడ్‌‌‌‌ అండ్‌‌‌‌ టొబాగో) కూడా బరిలో ఉన్నారు.