ఫేవరెట్‌‌‌‌గా నీరజ్‌‌‌‌ చోప్రా.. నేడు డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌

ఫేవరెట్‌‌‌‌గా నీరజ్‌‌‌‌ చోప్రా.. నేడు డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌

యుజీన్‌‌‌‌ (అమెరికా) :  వరల్డ్ అథ్లెటిక్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో  గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో చరిత్ర సృష్టించిన ఇండియా స్టార్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా శనివారం జరిగే ప్రతిష్టాత్మక డైమండ్‌‌‌‌ లీగ్ ఫైనల్స్‌‌‌‌లో డిఫెండింగ్ చాంప్‌‌‌‌ హోదాలో  ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతున్నాడు.  గత సీజన్‌‌‌‌లో విజేతగా నిలిచిన నీరజ్‌‌‌‌ దాదాపు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో పోటీ పడ్డ ప్రత్యర్థులు బరిలో నిలిచే ఈవెంట్‌‌‌‌లో టైటిల్‌‌‌‌ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. అదే జరిగితే రూ. 25 లక్షల ప్రైజ్‌‌‌‌మనీతో పాటు 2017లో ఫార్మాట్‌‌‌‌ మారిన డైమండ్‌‌‌‌ లీగ్‌‌‌‌లో టైటిల్‌‌‌‌ నిలబెట్టుకున్న మూడో అథ్లెట్‌‌‌‌గా నిలుస్తాడు.

ALSO READ: హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం లైన్‌ క్లియర్‌