కరోనాపై నెగిటివ్‌ ప్రచారం జరుగుతుంది: ఈటల

కరోనాపై నెగిటివ్‌ ప్రచారం జరుగుతుంది: ఈటల

కరోనా వైరస్‌పై నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోందన్నాను మంత్రి ఈటల రాజేందర్. అన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో వసతులు సరిగా లేవని జూనియర్ డాక్టర్లు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోందన్నారు. వైద్య సిబ్బందికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. డాక్టర్లే మాస్క్‌లు వేసుకుని తిరుగుతే జనాల్లో ఇంకా భయం పెరుగుతుందన్నారు. తెలంగాణలో నివసిస్తున్నవారికి కరోనా సోకలేదని అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే వైరస్‌ వచ్చిందన్నారు. ప్రజలకు పారామెడికల్ సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు మంత్రి ఈటల.