
ఇబ్రహీంపట్నం, వెలుగు: విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి వద్ద బక్రీద్సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
అక్కడ ఉన్న సిబ్బంది, మంచాల సీఐ మధుతో మాట్లాడారు. చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేశారు. అక్రమంగా గోవులను రవాణా చేస్తే చర్యలు తప్పవని, అక్రమ రవాణా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో ఆయన వెంట మహేశ్వరం డీసీపీ సునితా రెడ్డి ఉన్నారు.