చర్చలు సఫలం.. సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

చర్చలు సఫలం.. సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

తెలంగాణలో కొన్ని రోజులుగా జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న సమ్మెను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చించిన జూనియర్ డాక్టర్లు అందుకు ఒప్పుకున్నారు. 

వారి డిమాండ్ల పై హామీ ఇవ్వడంతో సమ్మె విరమణకు జూడాలు అంగీకరించారు. ఎనిమిది డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో రేపటి యథావిధిగా వారి విధుల్లో కొనసాగనున్నారు జూడాలు.