
రాజ్కోట్: మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. తన కెప్టెన్సీ పూర్తిగా మార్చేశాడని టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ఆడటం వల్ల తనలో చాలా మార్పులు తీసుకొచ్చాడని చెప్పాడు. ‘టైటాన్స్ను దృష్టిలో పెట్టుకుని చూస్తే నెహ్రాతో కలిసి పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తా. నా కెప్టెన్సీలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చాడు. మా మైండ్సెట్స్ను కంప్లీట్గా మార్చేశాడు.
ఒత్తిడి పరిస్థితుల్లో కచ్చితమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలోఅనుభవంతో చేసి చూపించాడు. దాన్ని మేం గ్రౌండ్లో అమలు చేసి సక్సెస్ అయ్యాం. చూడటానికి మేం ఇద్దరు వేర్వేరు వ్యక్తులమే అయినా మా క్రికెటింగ్ ఆలోచనలు మాత్రం సేమ్. అతనితో కలిసి పని చేయడం వల్ల నా కెప్టెన్సీకి విలువ పెరిగింది. మ్యాచ్ను అంచనా వేయడంలో నెహ్రా దిట్ట. అతని సలహాలు నాకెప్పుడూ ఉపయోగపడతాయి’ అని పాండ్యా పేర్కొన్నాడు.