ఆదిపురుష్ పై మరో వివాదం.. చూడామణి స్థానంలో గాజు.. మండిపడుతున్న నెటిజన్స్

ఆదిపురుష్ పై మరో వివాదం.. చూడామణి స్థానంలో గాజు.. మండిపడుతున్న నెటిజన్స్

ప్రభాస్(Prabhas) రాముడిగా వస్తున్న ఆదిపురుష్(Adipurush) సినిమాపై మరో వివాదం రాజుకుంది. ఈ సినిమాలో రామాయణాన్ని(Ramayanam) వక్రీకరించి చూపిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇక రామాయణ గాధ ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) సీత పాత్రలో కనిపించనుంది. 

అయితే.. లంకలో ఉన్న సీతమ్మ తన ఆనవాలుగా ఆంజనేయుడికి చేతి గాజు ఇచ్చినట్టుగా ట్రైలర్ లో చూపించారు. నిజానికి రామాయంలో సీతమ్మ చూడామణిని తన గుర్తగా హనుమంతుడికి ఇస్తుంది. కానీ ఆదిపురుష్ ట్రైలర్ లో చూడామణి స్థానంలో చేతి గాజు ఇచ్చినట్టుగా చూపించారు. 

ఇది చరిత్రను వక్రీకరించినట్టే అవుతుందని, డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) ఏ ఆధారాలతో చూడామణి బదులుగా గాజును చూపించారు అని కొంతమంది ఆయన పై మండిపడుతున్నారు. అంతేకాదు ఈ ఒక్క సన్నివేశమేనా లేక ఇలాంటి మార్పులు ఇంకా చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు ఓం ఎలాంటి సమాదామా ఇస్తారో చూడాలి. ఇక ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు.