న్యూ హెల్తీ ట్రెండ్: చిరుధాన్యాలతో ఇడ్లీలు.. విస్తరాకుల్లో వడ్డన

న్యూ హెల్తీ ట్రెండ్: చిరుధాన్యాలతో ఇడ్లీలు.. విస్తరాకుల్లో వడ్డన
ఒకప్పుడు  వేడుక ఏదైనా విస్తరాకుల్లోనే భోజనం వడ్డించేవాళ్లు. కానీ, ఇప్పుడు పేపర్​, ప్లాస్టిక్​ ప్లేట్స్​  వాటిని పూర్తిగా రీప్లేస్​ చేశాయి. ఒకరిద్దరు మినహాయించి అందరూ విస్తరాకుల్ని పక్కనపెట్టేశారు. కానీ, వైజాగ్​​కి చెందిన ఈ మిల్లెట్​ మ్యాన్​ మాత్రం విస్తరాకుల్లో వడ్డించడమే కాదు  వాటిల్లోనే హెల్దీ ఇడ్లీలని కూడా  ప్రిపేర్​ చేస్తున్నాడు. అంతేకాదు రైతులకు అండగా నిలుస్తున్నాడు కూడా. అదెలాగంటే.. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకి చెందిన చిత్తమ్​ సుధీర్​   నాగార్జున యూనివర్సిటిలో ‘ఆగ్రో ఎకనామిక్స్’​లో మాస్టర్స్​ చేశాడు. ఆ టైంలో నేచురల్​ ఫార్మింగ్​పై ఆసక్తి కలిగింది అతనికి. దాంతో వ్యవసాయం వైపు అడుగులేశాడు. నేచురల్​ ఫార్మింగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి రైతులతో కొన్ని నెలలు గడిపాడు. అప్పుడే  మిల్లెట్స్ సాగు, వాటివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకున్నాడు. ఇంట్రెస్టింగ్​గా అనిపించడంతో సొంతూల్లో మిల్లెట్​ సాగుకి గ్రౌండ్​ వర్క్​ మొదలుపెట్టాడు. కానీ,  ఆ టైంలో అవి పండించే రైతుకు లేని డిమాండ్​ వాటితో తయారుచేసిన వంటకాలకి ఉందని తెలుసుకున్నాడు. దాంతో ‘వాసెన పోలి’ స్టాల్​లో చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీలను అమ్మడం  స్టార్ట్​ చేశాడు. ఈ పేరే ఎందుకంటే సాధారణంగా మినప్పప్పుని​ రుబ్బి, అల్లం, జీలకర్ర, కొద్దిగా మె౦తులు కలిపి ఆవిరిమీద ఉడికించే  ప్రాసెస్​ని వాసెన పోలి అంటారు. ఆ ట్రెడిషనల్​ పద్ధతిలోనే  మిల్లెట్స్​తో ఇడ్లీలు చేస్తుండటంతో సుధీర్​ కూడా తన స్టాల్​కి వాసెన పోలి అని పేరు పెట్టాడు.   ప్రత్యేకత అదే   కేవలం జొన్న​, కొర్ర, రాగి, వరిగ, సామల, ఆరిక, సజ్జ, ఊద, మల్టీ మిల్లెట్స్​తో తయారుచేసిన ఇడ్లీలని మాత్రమే అమ్ముతాడు సుధీర్​. వాటిల్లోకి చట్నీలను కూడా సొరకాయ, అల్లం, క్యారెట్​లతో తయారుచేస్తాడు. ఇడ్లీలను కూడా  విస్తరాకుల్లో ఆవిరిపై ఉడికిస్తాడు. ఇన్ని స్పెషాలిటీలు ఉండటంతో కస్టమర్స్​ ‘క్యూ’ కడుతున్నారు ఇతని స్టాల్​కి. రోజుకి ఐదు వందల ప్లేట్​ల ఇడ్లీలు అమ్ముడుపోతున్నాయి ఇప్పుడు. వీకెండ్స్​లో అది​ మరో రెండొందలు పెరుగుతుంది. ప్రతి నెలా  ఇడ్లీలకి కావాల్సిన 700 కిలోల మిల్లెట్స్​ని కూడా  నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తున్నాడు  సుధీర్. వాళ్లకి మార్కెట్​ ధర కన్నా 30 రూపాయలు ఎక్కువగానే ముట్టజెప్తున్నాడు. చిరుధాన్యాలతో తయారుచేసిన ఇడ్లీలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్​ లాంటి మినరల్స్​ పుష్కలంగా ఉంటాయి.  ఫోలేట్, బి6, సి, ఈ, కె విటమిన్​లు కూడా అధికం. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అందుకే మిల్లెట్స్​తో ఇడ్లీలు తయారు చేసి అమ్ముతున్నా. మొదట్లో అరకొరగానే కస్టమర్లు వచ్చేవాళ్లు. కానీ, వీటివల్ల కలిగే హెల్త్​ బెనిఫిట్స్​పై అవేర్​నెస్​ పెరగడంతో కస్టమర్స్​ పెరిగారు.  ఇప్పుడు వైజాగ్​లో ఫేమస్​ టిఫిన్​  స్టాల్స్​లో ఒకటిగా మారింది ‘వాసెన పోలి’ అంటున్నాడు సుధీర్​.