దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ ‘టక్సన్ 2022’ను రూ. 27.69 లక్షలతో లాంచ్ చేసింది. హెచ్టీఆర్ఏసీ టెక్నాలజీ & మల్టీ-టెర్రైన్ మోడ్తో కూడిన టాప్- ఎండ్ మోడల్ ధర రూ. 34.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. రూ. 50 వేలు చెల్లించి ఈ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్ 8 -- 10 నెలల వరకు ఉంటుంది.
ఇది పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. టక్సన్లోని 2.0-లీటర్ పెట్రోల్ 150 హెచ్పీ శక్తిని, 192 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 252 హెచ్పీ శక్తిని, 415 ఎన్ఎం టార్క్ను ఇస్తుంది. ఇంజన్ కాన్ఫిగరేషన్ ఆధారంగా 6-స్పీడ్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఏడీఏఎస్, ముందువెనుకల రాడార్ కెమెరా, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్- అవాయిడెన్స్, అసిస్టెన్స్ వంటివి ఉన్నాయి.