మళ్లా కేసీఆరే సీఎం అయితడు..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

మళ్లా కేసీఆరే సీఎం అయితడు..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

తొగుట (దౌల్తాబాద్), వెలుగు: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు.   వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ 100 స్థానాల్లో గెలువబోతోందని, మూడోసారి కూడా కేసీఆరే సీఎం అవుతారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.  గురువారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రీయల్ గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి చీఫ్‌‌‌‌ గెస్టుగా హాజరయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్  ద్వారా తెలంగాణ మొత్తం సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.  అనంతరం తెలంగాణ ఉద్యమంలో అమరుడైన ప్రమోద్ తల్లితండ్రులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ జిల్లా ఇన్‌‌‌‌చార్జి వెంకటేశ్వర్లు, మామిడి మోహన్ రెడ్డి, మనోహర్ రావు, వెంకట నర్సింహ రెడ్డి, సోలిపేట సతీశ్ రెడ్డి, దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్,  ఎంపీపీ సంధ్య రవీందర్, జడ్పీటీసీ రణం జ్యోతి, ఎంపీటీసీ దేవేందర్ పాల్గొన్నారు.