పార్లమెంట్ ప్రారంభోత్సవం

పార్లమెంట్ ప్రారంభోత్సవం

పార్లమెంట్ లో ప్రధాని స్పీచ్

  • తొమ్మిదేళ్లలో గ్రామాలను కలుపుతూ 4 లక్షల కి.మీ రోడ్లు నిర్మించాం
  • తొమ్మిదేళ్లలో నవనిర్మాణం, పేదల సంక్షేమం  కోసం శ్రమించాం
  • ఈ లోగా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి
  • మరో 25 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది
  • పాత పార్లమెంట్ లో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి
  • రాబోయే రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది..దానికి అనుగుణంగా కొత్త భవనం నిర్మించాం
  • కొత్త పార్లమెంట్ ను భారతీయులంతా స్వాగతిస్తున్నారు
  • ఆధునిక పరిజ్ఞానంతో పార్లమెంట్ కొత్త భవనం నిర్మించాం
  • నయా భారత్ నయా లక్ష్యం వైపు వెళ్తోంది
  • ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలి
  • అమృత్ కాల్ లో అన్ని కఠిన సవాళ్లను అధిగమిస్తాం
  • ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిది
  • చోళ  సామ్రాజ్య చరిత్రలో సెంగో ల్ కు ప్రత్యేక స్థానం ఉంది
  • సేవ,కర్తవ్యానికి సెంగోల్ ప్రతీక
  • మీడియాలో కథనాల ద్వారా సెంగో ల్ కు గౌరవం పెరిగింది
  • సెంగోల్  గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి
  • భారత్ కత్త లక్ష్యాలను ఎంచుకుంది
  • ప్రపంచం మొత్తం నవ భారత్ వైపు చూస్తోంది
  • భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది
  • ఆత్మనిర్భర భారత్ కు పార్లమెంట్ సాక్షిగా నిలుస్తుంది
  • కొత్త పార్లమెంట్, కొత్త భారత్ కు కొత్త జోష్ తీసుకొచ్చింది
  • లోక్ సభలో సెంగోల్ అందరికి ప్రేరణ
  • పవిత్రమైన సెంగోల్ ను పార్లమెంట్ లో ప్రతిష్టించాం
  • భారత్ ముందుకెళ్తే ప్రపంచం ముందుకెళ్తుంది
  • ఆధునికి భారత్ కు పార్లమెంట్ కొత్త భవనం అద్దం పడుతోంది
  • ఇది కేవలం భవనం మాత్రమే కాదు..140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక
  •  ఈ రోజు చరిత్రలో నిలిచిపోతోంది
  • స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత పార్లమెంట్ కొత్త భవనం నిర్మించుకున్నం
  • 140 కోట్ల భారతీయుల కల సాకారం అయ్యింది
  •  ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం
  • సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ
  • రూ.75 విశిష్ట నాణెం విడుదల చేసిన మోడీ
  • మోడీ దృఢ సకల్పం వల్లే తక్కువ టైమ్ లో కొత్త పార్లమెంట్ భవనం  పూర్తయింది
  • భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం - ఓం బిర్లా
  • సభలో మాట్లాడుతున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
  • పార్లమెంట్ లో లఘుచిత్రాల ప్రదర్శన
  • అనేక చారిత్రక ఘటనలకు పార్లమెంట్ భవనం సాక్షిగా నిలిచింది 
  • కొత్త పార్లమెంట్ భవనం దేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీక
  • సభ్యల కోసం ఎన్నో అధునిక వసతులు కల్పించారు
  • సభలో ప్రసంగిస్తున్న రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్
  •  సభకు  హాజరైన ప్రధాని మోడీ, స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, ఎంపీలు  
  •  నూతన పార్లమెంట్ లో ప్రారంభమైన సభ
  • హాజరైన మాజీ రాష్ట్రపతి కోవింద్, మాజీ ప్రధాని దేవేగౌడ
  • సభలో నిలబడి మోడీకి సభ్యుల అభివాదం
  • ప్రధాని మోడీకి స్వాగతం పలికిన సభ్యులు
  • కొనసాగుతోన్న కొత్త  పార్లమెంట్ ప్రారంభోత్సవం  రెండో సెషన్
  • ​​​​​​రెండు సెషన్లుగా ప్రారంభోత్సవ కార్యక్రమం
  • ఉదయం 7.15 నుంచి 9.30 గంటలకు వరకు మొదటి సెషన్‌
  • ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్న రెండో సెషన్‌

  • ​​​​​​నూతన పార్లమెంట్ భవనంలో ముగిసిన సర్వమత ధర్మ ప్రార్థనలు

  • నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్, హాజరుకానీ కేసీఆర్
  • కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు

 

  • నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 
  • పార్లమెంట్ భవనంలోకి వెళ్లే ముందు ప్రధాని మోదీ సెంగోల్‌కు నమస్కరించారు.

  • పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సెంగోల్‌ను ఏర్పాటు చేయగా, ఆయనతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.

  • తమిళనాడు సెంగోల్‌ను ప్రధాని మోదీకి అందించారు. 18 మఠాల మఠాధిపతులు ఆయనను ఆశీర్వదించారు.

  • పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులను ప్రధాని మోడీ సన్మానించారు.. కార్మికులను శాలువతో సత్కరించి వారికి జ్ఞాపికలను అందజేశారు మోడీ 

  • లోక్ సభలోని స్పీకర్ పోడియం పక్కన సెంగోల్ ను  ప్రధాని  మోడీ ప్రతిష్టించారు.  సభలో భాజాభజంత్రీలు, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య  సెంగోల్ ను  ప్రతిష్టించారు.  
  • హోమంతో ప్రారంభమైన పార్లమెంట్ ప్రారంభోత్సవం ..  గణపతి హోమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
  • కొత్త పార్లమెంట్ భవనానికి  ప్రధాని మోడీ చేరుకున్నారు.  మరికాసేపట్లో  పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.  

కొత్త పార్లమెంట్ భవనాన్ని  ప్రధాని మోడీ 2023 మే 28 ఆదివారం ప్రారంభించనున్నారు. దాదాపు 25 పార్టీల ప్రతినిధులు, పలు రాష్ట్రాల సీఎంలతో సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.

కొత్త  పార్లమెంట్ విశేషాలు

  • 2020 డిసెంబర్ 10న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకస్థాపన చేశారు.
  • పాత పార్లమెంట్ భవనంలో లోక్‌సభ 545, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే సీటింగ్ కెపాసిటి ఉండేది.
  • కొత్త భననంలో లోక్‌సభ 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే సీటింట్ కెపాసిటీని ఏర్పాటు చేశారు.
  • కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో 64,500 చదరపు మీటర్లు స్థలంలో నిర్మించారు.
  • సెంట్రల్ విస్తా భవన సముదాయ వరుసక్రమంలో త్రిభుజాకారంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. దీనిలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, రాజ్యాంగ బద్ధ సంస్థల కార్యాలయాలు ఉంటాయి.
  • కొత్త లోక్‌సభ ఛాంబర్‌ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో నిర్మించారు.
  • రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పుష్పం ఆకృతిలో నిర్మించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో నిర్మాణం భారతీయ నిర్మాణ వారసత్వం ప్రతిబింబించేలా నిర్మించినట్లు తెలుస్తోంది.