
- ఈనెల 20 వరకూ మంజూరైన కార్డులకు కూడా పంపిణీ
- నగర పరిధిలోనే 14,488 మెట్రిక్ టన్నుల కోటా
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల లబ్ధిదారులతో పాటు పాతవారికీ సెప్టెంబర్కోటా సిద్ధమైందని అధికారులు తెలిపారు. ఈనెల 20వ తేదీలోపు మంజూరైన కొత్త రేషన్కార్డుల లబ్ధిదారులకు సైతం సెప్టెంబరు నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలో ఆగస్టు 20వ తేదీ నాటికి కొత్తగా లక్ష రేషన్కార్డులు మంజూరైనట్టు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గత జూన్ నెలలోనే మూడు నెలల బియ్యం కోటాను అధికారులు పంపిణీ చేశారు. తర్వాత రెండు నెలలుగా అధికారులు కొత్త రేషన్కార్డుల మంజూరుపైనే దృష్టి పెట్టారు.
1 నుంచి 15వ తేదీ వరకు..
హైదరాబాద్కోర్సిటీలోని 9 సర్కిళ్ల పరిధిలోనే సెప్టెంబరు నెలలో 7,12,352 రేషన్కార్డులకు సంబంధించి 14,488 మెట్రిక్టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనున్నట్టు హైదరాబాద్ డీఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సరుకుల పంపిణీ ఉంటుందన్నారు.
మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో దాదాపు 7.5 లక్షల రేషన్షాపులకు కూడా కేటాయింపులు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం గ్రేటర్పరిధిలో కొత్త రేషన్కార్డుల వెరిఫికేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు లక్ష దరఖాస్తులు వెరిఫికేషన్ కోసం పెండింగ్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.