న్యూ ఇయర్ కిక్ రూ.658 కోట్లు.. రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్

న్యూ ఇయర్ కిక్ రూ.658 కోట్లు..  రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్
  • డిసెంబర్ 30న ఒక్కరోజే రూ.313 కోట్ల అమ్మకాలు

హైదరాబాద్, వెలుగు: కొత్త ఏడాదిని సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. ఆదివారం సెలవు అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్‌‌లో పెట్టి మరీ లిక్కర్, బీర్లను వైన్ షాపులకు పంపారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా రూ.658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయి. 

ముందే ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్బుల్లోనూ లిక్కర్ భారీగా డంప్ చేశారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వడం, రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరిగింది. మూడు రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేస్​లు, 6.31 లక్షల బీర్ కేస్​లు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక్క 30వ తేదీనే రూ.313 కోట్ల లిక్కర్ సేల్ కావడం గమనార్హం.