రాష్ట్రంలో మరో 1,015 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 1,015 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,015 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,54,666 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి ముగ్గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,393కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,716 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,35,950గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,323 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 14,694 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 40,603 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 47,70,004 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 92.65 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 172, రంగారెడ్డి 98, మేడ్చల్ 97, భద్రాద్రి 80, నల్గొండ 57, ఖమ్మం 48, కరీంనగర్ 46, సంగారెడ్డి 42, వరంగల్ అర్బన్ 41 కేసులు నమోదైనట్లు రోగ్యశాఖ తెలిపింది.

For More News..

కంటిచూపు పోగొట్టినందుకు దవాఖానకు 3 లక్షల పెనాల్టీ

టీఆర్ఎస్ ఓడిందని కార్యకర్త సూసైడ్.. పాడే మోసిన మంత్రులు

కాంట్రాక్ట్‌‌ జాబ్స్‌‌ వైపు హైదరాబాదీలు