రాష్ట్రంలో మరో 1,983 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 1,983 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,983 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,02,594 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1181కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,381 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,74,769గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,644 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 21,784 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 50,598 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,92,195 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా మరియు రికవరీ రేటు 86.26 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 292, రంగారెడ్డి 187, మేడ్చల్ 145, ఖమ్మం 117, కరీంనగర్ 109, నల్గొండ 105, సిద్ధిపేట్ 89, భద్రాద్రి 85, సూర్యపేట్ 75, వరంగల్ అర్బన్ 75, నిజామాబాద్ 62, కామారెడ్డి 56 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

వరంగల్ కెనాల్‌లో పడి ఇద్దరు బాలురు గల్లంతు

షెడ్యూల్ ఏరియాల్లో ఆస్తుల సర్వే నిలిపివేయాలి

యోగి రాజ్యంలో దళితులకు రక్షణ  లేదు