తెలంగాణలో మరో 2,166 కరోనా కేసులు

తెలంగాణలో మరో 2,166 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,166 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,74,774 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1052కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,143 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,44,073గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,649 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 22,620 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 53,690 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 25,73,005 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 309, రంగారెడ్డి 166, మేడ్చల్ 147, కరీంనగర్ 127, నల్గొండ 113, సిద్ధిపేట్ 88, ఖమ్మం 87, వరంగల్ అర్బన్ 95, నిజామాబాద్ 90, మహబూబా బాద్ 90, భద్రాద్రి 79, జనగాం 79, సూర్యపేట్ 64, సిరిసిల్ల 51, కామారెడ్డి 50, పెద్దపల్లి 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

ఎమ్మెల్సీ సీటు కోసం బీజేపీలో పోటీ

ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా పదిసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఆంగ్ రీటా మృతి

మద్దతు ధర పెంచిన కేంద్రం.. ఏ పంటకు ఎంతంటే..