సిరీస్ డ్రా.. ఫాలో ఆన్ ఆడి గెలిచిన న్యూజిలాండ్

సిరీస్ డ్రా.. ఫాలో ఆన్ ఆడి గెలిచిన న్యూజిలాండ్

క్రికెట్ లో ఇప్పుడంతా టీ20లదే హవా నడుస్తోంది. వన్డే, టెస్టు క్రికెట్ కు ఆధరణ తగ్గుతోంది. కానీ, టెస్టు క్రికెట్లో ఉండే మజానే వేరు. ఏ సెషన్ లో ఏం జరుగుతుంది? ఆట ఏ రోజు ఏ టీం వైపు మళ్లుతుందో? అన్న ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచులో ఒక్క పరుగుతేడాతో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించిన న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్ లో విఫలమై ఫాలో ఆన్ ఆడి గెలిచిన మూడో జట్టుగా రికార్డు నెలకొల్పింది. 

ఫాలో ఆన్ ఓటమినుంచి తప్పించుకొని అనూహ్యంగా మ్యాచ్ గెలిచి సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. ఇలా ఫాలో ఆన్ ను తప్పించుకొని మ్యాచ్ గెలిచిన జట్లు ఇంగ్లండ్ (1894, 1981లో ఆస్ట్రేలియాపై), భారత్ (2001లో ఆస్ట్రేలియాపై) జట్ల సరసన న్యూజిలాండ్ చేరింది.