తమిళనాడులో మళ్లీ NIA సోదాలు

తమిళనాడులో మళ్లీ NIA సోదాలు

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ దృష్టి తమిళనాడుపై పడిందని.. రాష్ట్రంలో దాడులకు పాల్పడేందుకు కుట్ర చేస్తోందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) చెబుతోంది. ఈ క్రమంలో కోయంబత్తూరు, నాగపట్నం, శివగంగ, తూత్తుకుడి, తిరుచ్చి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా NIA అధికారులు రెండు ల్యాప్ టాప్ లు, కొన్ని డాక్యుమెంట్లు, 8 మొబైల్ ఫోన్లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. హిందుత్వ వాదులే లక్ష్యంగా ఐసీస్ దాడులకు కుట్ర పన్నుతోందని ఓ నిందితుడ్ని విచారించిన సమయంలో NIA అధికారులు తెలుసుకున్నారు.

గతేడాది తమిళనాడులో ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక సమాచారం సేకరించారు. ఈ సమాచారం ఆధారంగానే తాజాగా ఎన్ఐఏ 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. NIA గతంలోనూ పలుమార్లు సోదాలు చేపట్టింది. 2018లో తమిళనాడులో జరిగిన ఓ దాడికి సంబంధించి తదుపరి దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.