
- సంగారెడ్డి ఓడీఎఫ్కు వర్క్ ఆర్డర్
సంగారెడ్డి, వెలుగు : త్వరలోనే యుద్ధరంగంలోకి నైట్ విజన్ ట్యాంకులు అడుగుపెట్టబోతున్నాయి. రాత్రి వేళల్లో కటిక చీకట్లో దాక్కున్న శత్రువులను గుర్తించి దాడి చేసే నైట్విజన్యుద్ధ ట్యాంకులను తయారు చేయాలంటూ సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఉన్న ఓడీఎఫ్ఫ్యాక్టరీకి ఆర్డర్వచ్చింది. గురువారం ఢిల్లీలో ఓడీఎఫ్(ఏవీఎన్ఎల్) సీఎండీ సంజయ్ ద్వివేది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకొని వాటి పత్రాలను అందజేశారు.
ఇప్పటికే సంగారెడ్డి ఓడీఎఫ్ ఫ్యాక్టరీ అధునాతన బీఎంపీ-2 యుద్ధ ట్యాంకులను తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే యుద్ధ ట్యాంకుల్లో కొన్ని అధునాతన మార్పులు చేస్తే బాగుంటుందని కేంద్ర రక్షణ శాఖ ఆలోచించింది. అందులో భాగంగానే నైట్ విజన్ ఎనేబిలిటీతో రూపొంందించాలని రూపొందించాలని సూచించింది. ఈ ట్యాంకుకు ఫైర్ కంట్రోల్ సిస్టం కూడా ఏర్పాటు చేయనున్నారు.