
భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్.. ఎలైట్ విమెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్లో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన 50 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో నిఖత్ 5–0తో ఎవా వేనీ మార్బానియాంగ్ (మేఘాలయా)పై గెలిచింది. బౌట్ ఆరంభం నుంచే పదునైన పంచ్లతో విరుచుకుపడిన నిఖత్.. స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
48 కేజీల ప్రిక్వార్టర్స్లో రైల్వేస్ బాక్సర్ మంజు రాణి 5–0తో కవితా (ఉత్తరాఖండ్)ను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. 52 కేజీల బౌట్లో జ్యోతి గులియా.. నేహా టాంటుబాయ్ (జార్ఖండ్)పై నెగ్గి ముందంజ వేసింది. మొత్తం 12 వెయిట్ కేటగిరీల్లో 300 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు.