ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరింది. సెమీస్లో ఏఐపీకు చెందిన శివిందర్ కౌర్పై 5-0 తేడాతో గెలిచి ఫైనల్ చేరుకుని పసిడి పతకానికి మరింత చేరువైంది. సూపర్ ఫామ్లో ఉన్న నిఖత్.. సెమస్ బౌట్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చలాయించి ఫైనల్కు దూసుకొచ్చింది. ఫైనల్లో రైల్వేస్కు చెందిన అనామికతో నిఖత్ తలపడనుంది.
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ 75కేజీ విభాగంలో ఫైనల్కు దూసుకొచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన జిగ్యాసా రాజ్ పుత్పై లోవ్లినా సునాయాసంగా గెలిచి ఫైనల్కు అర్హత సాధించింది. ఫైనల్లో 2021 ప్రపంచ యూత్ ఛాంపియన్ ఎస్ ఎస్ సీబీకి చెందిన అరుంధతి చౌదరితో అమీతుమీ తేల్చుకోనుంది. ఈమెతో పాటు.. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్లో సిల్వర్ గెలిచిన మంజు రాణి (48 కేజీలు), 2017 ప్రపంచ యూత్ ఛాంపియన్ జ్యోతి గులియా (52 కేజీలు) , శిక్ష (54 కేజీలు), పూనమ్ (60 కేజీలు), శశి (63 కేజీలు), అనుపమ (81 కేజీలు), నుపుర్ (81+ కేజీలు) కూడా ఫైనల్కు చేరుకున్నారు.