
హైదరాబాద్: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. ఎలైట్ బాక్సింగ్ నేషనల్ ఓపెన్లో బోణీ చేసింది. శనివారం జరిగిన విమెన్స్48–51 కేజీ కేటగిరీలో నిఖత్ 4–1తో రాశి శర్మ (యూపీ)పై గెలిచింది. బౌట్ఆరంభం నుంచే తెలంగాణ బాక్సర్అప్పర్ కట్స్, హుక్స్తో చెలరేగింది. 60–65 కేజీల్లో యాషి శర్మ 5–0తో మోనిషా (తమిళనాడు)ను ఓడించింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం మొదలైన ఈ టోర్నీని తెలంగాణ స్పోర్ట్స్అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి ప్రారంభించారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీలు నిర్వహించడం ద్వారా తెలంగాణ భావి క్రీడాకారులకు స్ఫూర్తి లభిస్తుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన నూతన క్రీడా విధానం దేశంలోనే ఆదర్శవంతమైన విధానంగా నిలబడి, తెలంగాణ క్రీడా భవిష్యత్ ముఖ చిత్రాన్ని మార్చుతుందని వ్యాఖ్యానించారు. క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు నిర్వహించే కార్యక్రమాలకు సాట్స్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి, మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ గౌడ్, బాక్సింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు సోహెల్, అజయ్ సింగ్ అన్షుమన్ పాల్గొన్నారు.