18 పేజెస్ సినిమా నుంచి కొత్త పాట

18 పేజెస్ సినిమా నుంచి కొత్త పాట

కార్తికేయ-2 సినిమాతో ఇటీవలే పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ 18 పేజెస్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బన్నీ వాసు డైరెక్షన్ లో,  అల్లు అరవింద్ నిర్మాతగా జీఏ 2 బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ‘టైం ఇవ్వు పిల్ల’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. 

బ్రేకప్ అయిన కుర్రాడు పాడే పాటే ‘టైం ఇవ్వు పిల్ల’. ఈ పాటను శింబు పాడాడు. గోపి సుందర్ సంగీతం అందించాడు. రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ సినిమా టీజర్, ‘నన్నయ్య రాసిన’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా 18 పేజెస్ థియేటర్లలోకి రానుంది.