గుజరాత్ కొత్త స్పీకర్ గా నిమాబెన్ ఆచార్య

గుజరాత్ కొత్త స్పీకర్ గా నిమాబెన్ ఆచార్య

గుజరాత్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.స్పీకర్  రాజేంద్ర త్రివేది తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవలే సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో భూపేంద్ర పాటిల్ ను సీఎంగా  బీజేపీ అధిష్ఠానం నియమించింది.  మరోవైపు ఇవాళ (గురువారం) ఆ రాష్ట్ర  అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు. త్రివేదికి మంత్రి వర్గంలో చోటు దక్కడంతో రాజీనామా చేశారు. స్పీకర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ఆ  తర్వాత ఆయన స్థానంలో కొత్త స్పీకర్ గా నిమ బెన్ ఆచార్య ఎంపికయ్యారు. ఈ పరిణామాలన్నీ కొన్ని గంటల్లోనే జరిగాయి.