కేసీఆర్‌‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి: జి.నిరంజన్

కేసీఆర్‌‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి: జి.నిరంజన్

 హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషిస్తూ కేసీఆర్ వాడిన భాషపై పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్రెస్‌‌మీట్‌‌లో కేసీఆర్ మాట్లాడిన భాష తీరుపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

శుక్రవారం ఆయన గాంధీ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన భాష ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉందన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. కేసీఆర్ తాను మాట్లాడే తీరును మార్చుకోవాలని సూచించారు. తుక్కుగూడ సభకు ఎందుకు వస్తున్నారని రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.