బీఆర్ఎస్ నేత కిడ్నాప్ కేసులో ట్విస్ట్..డ్రైవరే నిందితుడు

బీఆర్ఎస్ నేత కిడ్నాప్ కేసులో ట్విస్ట్..డ్రైవరే నిందితుడు

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం 44వ నేషనల్ హైవే వద్ద ఇవాళ తెల్ల వారుజామున కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ ను  గుర్తు తెలియని వ్య క్తులు కిడ్నాప్ చేశారు. హరీశ్ రావును మామడ మండంలోని ఆయన సొంతూరు పొన్నల్ నుంచి కిడ్నాపర్లు బెదిరించి అతడి ఇన్నోవా వాహనంలో నే అపహరించి హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు.  కిడ్నాపర్లు రూ. 3 కోట్లు డిమాండ్ చేసిన్నట్లు సమాచారం.. 

ఈక్రమంలో మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద వాహనం వేగం తగ్గడంతో కిడ్నాపర్ల నుంచి హరీశ్ తప్పించుకుని తూప్రాన్ పీఎస్ కు చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హరీశ్ చాకచక్యంగా తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు  చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం తాను సేఫ్ గానే  ఉన్నట్లు హరీశ్ రావు  తన సన్నిహితులకు ఫోన్ లో చెప్పాడు. ఈ ఘటనపై తూప్రాన్ పోలీసులు మామడ పోలీసులకు ఈ విషయమై సమాచారం అందించడంతో ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. హరీశ్  డ్రైవరే కిడ్నాప్ సూత్రదారిగా ఉన్న ట్లు తెలుస్తోంది. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.