నిర్మల్ జిల్లాలో రైతుల తిప్పులు అంతా ఇంతాకావు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు నిద్రాహారాలు మానాల్సిన పరిస్థితి నెలకొంది. కుబీర్, తానూర్ వ్యవసాయ సహకార సంఘాల ఆఫీసుల సోయా టోకెన్ సెంటర్లలో క్యూలైన్లలో రైతులు నిద్రపోయిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
శనివారం( నవంబర్1) రాత్రి నుంచి నిర్మల్ జిల్లాలోని కుబీర్, తానూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల దగ్గర సోయా టోకెన్ కోసం రైతులు పడిగాపులు పడ్డారు. రాత్రంతా టోకెన్ సెంటర్ల దగ్గర క్యూలైన్లో నిద్రపోవాల్సిన దుస్థితి వచ్చింది. టోకెన్ ఎప్పుడు ఇస్తారో తెలియన పరిస్థితుల్లో రైతులు చెప్పులు క్యూలైన్ లో పెట్టి అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నారు. అధికారులు స్పందించి టోకెన్లు ఇచ్చి వెంటనే సోయా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
