ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ :  లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర తగినంత డబ్బు లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తనకు అవకాశం కల్పించారని..అయితే, డబ్బులు లేని కారణంగా పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని చెప్పారు. బుధవారం ఢిల్లీలో జరిగిన  టైమ్స్ నౌ సమిట్ 2024లో ఆమె మాట్లాడారు. ‘లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా దగ్గర డబ్బు లేదు. ఏపీ లేదా తమిళనాడు రాష్ట్రాల్లో నాకో సమస్య ఉంది. అక్కడ గెలుపునకు కులం, మతం అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవన్నీ చేయలేనని, అందుకే పోటీ చేయనని చెప్పాను. బీజేపీ హైకమాండ్ నా నిర్ణయాన్ని అంగీకరించడం గొప్ప విషయం’ అని వివరించారు. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి వద్ద ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవా? అని రిపోర్టర్ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.