మొరార్జీ రికార్డును సమం చేసిన నిర్మల

మొరార్జీ రికార్డును సమం చేసిన నిర్మల

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్  రికార్డును సమం చేశారు. మొరార్జీ తర్వాత వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన రెండో ఆర్థిక మంత్రిగా నిర్మల రికార్డు సృష్టించారు. ఆమె ఆర్థిక మంత్రిగా జులై 2019లో బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా ఘనతను దక్కించుకున్నారు. ఆమె ఇప్పటికే ఐదు సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ ను సమర్పించారు.

గురువారం ప్రవేశపెట్టినది ఆమెకు మొదటి తాత్కాలిక బడ్జెట్. గతంలో ఆర్థికమంత్రులుగా పని చేసిన మన్మోహాన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా వరుసగా ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టగా, తాజా తాత్కాలిక బడ్జెట్ తో నిర్మల వారి రికార్డును అధిగమించారు.