మన ఇసుక వాహనం స్కీమ్ షురూ : కలెక్టర్ ఇలా త్రిపాఠి

మన ఇసుక వాహనం స్కీమ్ షురూ : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • ఆన్​లైన్​లో బుకింగ్ యాప్​
  • ట్రాక్టర్ సమకూర్చుకుంటే ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఇక నుంచి ఇసుక పర్మిషన్​లు ఆన్​లైన్​లోనే పొందాలని, ఆఫ్​లైన్ విధానానికి స్వస్తి చెప్పినట్లేనని, మన ఇసుక వాహనం స్కీమ్​ యాప్ అమలులోకి తెచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె సబ్​ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మైనింగ్, గ్రౌండ్​ వాటర్​ ఇంజినీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా ఇస్తామని, లబ్ధిదారులు ట్రాక్టర్​ సమకూర్చుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఇండ్లు కట్టుకునే వారు, సర్కార్​ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ.1,173 యూపీఐ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. స్మార్ట్​ ఫోన్ వినియోగించి ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని, ఫోన్​లులేని వారు పంచాయతీ సెక్రటరీలను కలవాలని తెలిపారు. టిప్పర్లు, లారీలకు అనుమతి లేదని చెప్పారు.

ఇసుక రీచ్​ల్లో జేసీబీ, డోజర్లు వాడొద్దని, కూలీలతోనే ట్రాక్టర్ ట్రాలీల్లో ఇసుక నింపించాలన్నారు. ఇసుక రవాణాలో అక్రమాలు నివారించడానికి అమలు చేస్తున్న ఈ కొత్త విధానాన్ని సక్సెస్ చేయాలని పేర్కొన్నారు. ఆర్డీవోలు సీరియస్​గా పర్యవేక్షించాలని ఇక నుంచి మాన్యువల్ రశీదులు, పర్మిషన్​లు ఇవ్వడానికి వీలులేదని వెల్లడించారు.