V6 News

రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్... 10 ఎకరాల చుట్టూ కంచె వేసిన హైడ్రా

రూ.750 కోట్ల  ప్రభుత్వ భూమి సేఫ్... 10 ఎకరాల చుట్టూ  కంచె వేసిన హైడ్రా

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట్​లో విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్​విలేజ్​సర్వే నంబర్​191లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ సుమారు రూ.750 కోట్లు కాగా, కొందరు వ్యక్తులు  ఈ భూమిలో కబ్జాకు యత్నించారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయగా, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. శాశ్వత నివాసాలను  వదిలేసి 10 ఎకరాల్లో ఉన్న షెడ్డు, ప్రహరీ గోడలను గురువారం తొలగించారు. అనంతరం ప్రభుత్వ స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు.