హైదరాబాద్, వెలుగు: జగిత్యాల మెడికల్ కాలేజీకి.. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) పర్మిషన్ ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లకు లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్వోపీ) ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభించుకోవచ్చని చెప్పింది. కాలేజీలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోవాలని సూచించింది. కాలేజీకి సంబంధించిన అన్ని పనులను, రిక్రూట్మెంట్లను ఇన్టైమ్లో పూర్తి చేస్తామని, నిధులు కేటాయిస్తామని రాష్ట్ర సర్కార్ నుంచి 2 వారాల్లో అండర్టేకింగ్ పత్రాలు తీసుకుని తమకు సమర్పించాలని కాలేజీ ప్రిన్సిపాల్కు రాసిన లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా తొలి దశలో 8 కాలేజీలకు ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర సర్కార్ నిరుడు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసింది. ఇందులో జగిత్యాల, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, సంగారెడ్డి, మహబూబాబాద్, వనపర్తి, నాగర్కర్నూల్ కాలేజీలున్నాయి. ప్రస్తుతం జగిత్యాల కాలేజీకి పర్మిషన్ వచ్చిందని, మిగిలిన 7 కాలేజీలకూ పర్మిషన్ వస్తుందని డీఎంఈ రమేశ్రెడ్డి తెలిపారు.
జగిత్యాల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్
- తెలంగాణం
- June 15, 2022
లేటెస్ట్
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్