న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ను ప్రారంభించిన తర్వాత ఎన్ఎండీసీ స్టీల్ (ఎన్ఎస్ఎల్) ను ప్రైవేటీకరించడానికి ఫైనాన్షియల్ బిడ్లను కేంద్రం ఆహ్వానించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఫర్నేస్ మొదలైతే కంపెనీ విలువ పెరుగుతుందని భావిస్తున్నారు. ఎన్ఎస్ఎల్కు సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
భారతదేశంలో అత్యధికంగా ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే ఎన్ఎండీసీ నుంచి విడిపోయిన తర్వాత ఎన్ఎస్ఎల్లో ప్రభుత్వానికి 60.79 శాతం వాటా వచ్చింది. మిగిలిన 39.21 శాతం వాటాను ఐపీఓ ద్వారా అమ్మారు. నిర్వహణ నియంత్రణతో పాటు తన వాటాలో 50.79 శాతాన్ని అమ్మాలని కేంద్రం చూస్తోంది.