ఏపీ లాక్ డౌన్ టైమింగ్స్ మారలేదు

 ఏపీ లాక్ డౌన్ టైమింగ్స్ మారలేదు

అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ వేళల్లో (టైమింగ్స్) ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో లాక్  డౌన్ వేళలు మారుస్తూ ప్రభుత్వం ప్రకటన చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 12 వరకు ఉన్న లాక్ డౌన్ సడలింపును ఈనెల 20 వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలిస్తున్నట్లు, ఆంద్రప్రదేశ్ లో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య దేశంలోనే 2 వ స్థానం లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.  "కర్ఫ్యూ టైంలో ఎలాంటి మార్పులు చేయలేదు". గతంలో మాదిరిగానే  ప్రతిరోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6:00 గంటల వరకు కర్ఫ్యూ ఆమల్లో ఉంటుంది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.