
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు బెదిరేది లేదన్నారు. యంగ్ ఇండియన్ ఆఫీస్ను మూయించడంతో మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇండ్ల ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైనా విమర్శలు గుప్పించారు.
గురువారం పార్లమెంట్ ఎదుట రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈడీతో కేంద్రం ఎన్ని బెదిరింపులకు దిగినా వెనుకడుగు వేయం. మోడీని చూసి భయపడే ప్రసక్తే లేదు. నేను ఏం చెబుతున్నానో.. మీకు అర్థం అవుతుందా?” అంటూ ఫైర్ అయ్యారు. “వారు ఏం చేయాలని అనుకుంటున్నారో.. చేయనివ్వండి.. మేం ఏం చేయాలో అది చేస్తాం. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఎప్పుడూ రాజీపడను. ఎన్ని బారికేడ్లు అడ్డంగా పెట్టినా.. ఎవరూ నిజాన్ని దాచలేరు” అని ఆయన కామెంట్ చేశారు.