రామకృష్ణాపూర్ (మందమర్రి), వెలుగు: రాష్ట్రంలో గల్లీకో వైన్షాపు పెడుతున్న సర్కారు ప్రభుత్వ దవాఖానాల ఏర్పాటు గురించి ఆలోచించడం లేదు. ప్రతి మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్, మున్సిపాలిటీల్లో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరడంలేదు. ఇందుకు ఉదాహరణే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతన్పల్లి మున్సిపాలిటీ. ఇక్కడ 40 ఏండ్లుగా ప్రభుత్వ దవాఖానా లేక జనాలు అరిగోస పడుతున్నారు. ఇక్కడ 40 వేల మంది జనాభా ఉన్నా ఒక్క సబ్ సెంటర్ కూడా లేదు.
సగం కంటే ఎక్కువ
సింగరేణి బొగ్గు గనులతో ఏర్పాటైన రామకృష్ణాపూర్(క్యాతన్పల్లి) సమైక్య రాష్ట్రంలో అతిపెద్ద మేజర్ పంచాయతీగా ఉండేది. 2018లో దీనికి దగ్గర్లోని తిమ్మాపూర్ పంచాయతీని విలీనం చేసి క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. విలేజ్నుంచి టౌన్స్థాయికి ఎదిగినా ఫెసిలిటీస్విషయంలో అక్కడే ఆగిపోయింది. ముఖ్యంగా వైద్యం విషయంలో ఇంకా వెనకబడే ఉంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉండే సింగరేణి ఎంప్లాయీస్, వారి ఫ్యామిలీస్ కోసం సింగరేణి మేనేజ్మెంట్రామకృష్ణాపూర్లో ఏరియా హాస్పిటల్ ఏర్పాటు చేసింది. మొదట్లో సింగరేణి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ దవాఖానా వారి అవసరాలకు సరిపోయేది. రాను రాను కోల్మైన్స్మూసివేయడం, ఎంప్లాయీస్ వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోవడం, రిటైర్డ్ కావడంతో వారి సంఖ్య తగ్గిపోయింది. రోజూ ఇతర పనులు చేసుకుంటూ బతికే కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఈ మున్సిపాలిటీలో జనాభా 40 వేలకు చేరింది. ఇందులో 5 వేల వరకు సింగరేణికి చెందిన వారు కాగా, మిగిలిన వారంతా కాట్రాక్ట్ కార్మికులు, వెహికిల్ డ్రైవర్లు, చిన్న చిన్న ఇండస్ట్రీల్లో పని చేసేవారు, కూలీ చేసుకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు, షాపుల్లో వర్కర్స్, బిల్డింగ్నిర్మాణ పనుల్లో పాల్గొనే వారే ఉన్నారు.
ప్రాణాలు పోతున్నాయ్
క్యాతన్పల్లిలో ఏదైనా ప్రమాదమో, ఆపదో వచ్చినప్పుడు లోకల్గా సర్కారు దవాఖానా లేక, ప్రైవేట్కు వెళ్లి స్థాయికి మించి ఖర్చు చేయలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఎయిడ్కు కూడా నోచుకోవడం లేదు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కాన్పు కోసం, పాము కాటేసినప్పుడు, హార్ట్ఎటాక్, సూసైడ్ అటెంప్ట్స్, రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బాధితులను 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని మందమర్రి, మంచిర్యాలలోని సర్కార్, ప్రైవేటు దవాఖానాలకు తీసుకెళ్తున్నారు. దీనికి కనీసం గంట టైం పడుతోంది. దీంతో చాలామంది దారిలోనే కన్నుమూస్తున్నారు.
గేటు పడితే ఆశ వదులుకోవాల్సిందే
ఎమర్జెన్సీ టైంలో మంచిర్యాల హాస్పిటల్కు వెళ్లేప్పుడు క్యాతన్పల్లి వద్ద రైల్వే గేట్పడితే ఇక ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఇక్కడ ఏడేండ్ల కింద రైల్వే ఫ్లైఓవర్బ్రిడ్జి మంజూరు కాగా ఆ పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. రెండేండ్ల కింద అల్లూరి సీతారామరాజునగర్కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భార్య భవానికి హార్ట్ఎటాక్ వచ్చింది. ఆమెను దవాఖానాకు తీసుకువెళ్తుండగా రైల్వే గేటు పడి ఇన్టైంలో ట్రీట్మెంట్ అందక చనిపోయింది. ఇలా చాలా సంఘటనలున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 50 మంది వరకు ఆర్ఎంపీలు ఉండగా జ్వరాలకు, నొప్పులకు వీరినే ఆశ్రయించాల్సి వస్తోంది. రెండేండ్లుగా కరోనాతో స్థానికుల తిప్పలు ఎక్కువయ్యాయి. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే టెస్టులు, ట్రీట్మెంట్ కోసం భయపడుతూనే మంచిర్యాల, మందమర్రిలకు వెళ్తున్నారు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబాలకు సర్కార్ దవాఖానా కోసం ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చొరవ చూపడంలేదు. కనీసం ఇక్కడో హాస్పిటల్ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా పెట్టలేదు. రూ.14లక్షలతో మూడేండ్ల కిందట రామకృష్ణాపూర్లోని శివాజీనగర్లో నిర్మించిన సబ్సెంటర్ ప్రారంభానికే నోచుకోలేదు. కేవలం మందమర్రిలోని యూపీహెచ్ఎస్, అర్బన్ హెల్త్ సెంటర్ కు చెందిన ఏఎన్ఎంలు సీజనల్ రోగాలిస్తే గోలీలిస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి తమ ప్రాంతంలో సర్కారు దవాఖానా ఏర్పాటు చేయాలని క్యాతన్పల్లి వాసులు కోరుతున్నారు.