- ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపిందర్ సింగ్ సోధి
న్యూఢిల్లీ: దేశంలో పాల రేట్లు ఇప్పట్లో కిందకి దిగి రాకపోవచ్చని ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపిందర్ సింగ్ సోధి వెల్లడించారు. పాల రేట్లు తగ్గడానికి బహుశా దీపావళి దాకా వెయిట్ చేయాల్సిందేనని అన్నారు. గత 15 నెలల్లో పాల రేట్లు 13 నుంచి 15 శాతం దాకా పెరిగాయి. అకాల వర్షాల వల్ల తగినంతగా దాణా దొరక్కపోవడంతో మిల్క్ ప్రొడక్షన్లో ఇబ్బందులెదురయ్యాయి. పాలు ఇచ్చే పశువుల సంఖ్య కూడా కొన్ని కారణాల వల్ల తగ్గిపోయింది.
సాధారణంగానే అక్టోబర్–ఫిబ్రవరి టైములో పాల ప్రొడక్షన్ ఎక్కువవుతుంది. ఆ సమయంలో డెయిరీ కంపెనీలు కూడా తమ ప్రొక్యూర్మెంట్ (పాల సేకరణ) రేట్లను తగ్గిస్తాయి. రూపిందర్ సింగ్ సోధి గతంలో అమూల్ డెయిరీ కో–ఆపరేటివ్కు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. రాబోయే రెండేళ్లలో తగినంతగా పాలు అందుబాటులో ఉండాలంటే రైతులకు సమంజసమైన రేట్లను చెల్లించాల్సిందేనని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మే నెల దాకా కొనసాగిన శీతాకాలం, గత రెండు నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల దేశంలో పాల ప్రొడక్షన్ 5 శాతం దాకా పెరిగే వీలు కల్పిస్తున్నాయని సింగ్ పేర్కొన్నారు.