- నెల రోజులుగా తగ్గుతున్న అటెండెన్స్
- పేరెంట్స్లో ఒమిక్రాన్వేరియంట్ టెన్షన్
హైదరాబాద్, వెలుగు: ఏడాదిన్నర తర్వాత మూడునెలల కిందటనే స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. మళ్లీ ఒమిక్రాన్వేరియంట్పేరెంట్స్ను భయపెట్టిస్తోంది. దీంతో పిల్లల్ని స్కూళ్లకు కష్టంగానే పంపస్తున్నారు. చాలామంది పేరెంట్స్ స్కూళ్లకు పంపకపోతుండగా, నెల రోజులుగా ప్రైమరీ క్లాసుల్లో అటెండెన్స్ పర్సెంటేజ్ తగ్గిందని స్కూల్ మేనేజ్మెంట్లు చెబుతున్నాయి. నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు 60 శాతం ఉన్న అటెండెన్స్30 శాతానికి పడిపోయిందని పేర్కొంటున్నాయి. ఒమిక్రాన్నేపథ్యంలో ఆన్ లైన్క్లాస్లే పెట్టాలంటూ పలువురు పేరేంట్స్ కోరుతున్నారు.
స్కూళ్ల తీరుపై పేరెంట్స్ లో..
జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొదట్లో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు మాత్రమే ఫిజికల్క్లాస్లు స్టార్ట్ అయ్యాయి. కొన్ని రోజులకు ప్రైమరీ క్లాస్లు కూడా షురూ చేశారు. మొదట్లో ప్రీ ప్రైమరీలో 20 నుంచి 30శాతం , ప్రైమరీలో 40 నుంచి 60 శాతం, హయ్యర్క్లాస్ల్లో 80 నుంచి 100శాతం అటెండెన్స్ఉండేదని, ఇప్పుడు పూర్తిగా తగ్గిందని మేనేజ్మెంట్లు అంటున్నాయి. ఒమిక్రాన్ కేసులు వస్తున్నప్పటికీ కొన్ని ప్రైవేట్స్కూల్స్కచ్చితంగా పిల్లల్ని ఫిజికల్ క్లాస్లకు పంపాలని చెప్తున్నాయి. స్కూళ్ల తీరుపై పేరెంట్స్ కొంత ఇబ్బంది పడుతున్నారు. మరి కొందరు పేరెంట్స్తమ పిల్లల్ని పూర్తిగా స్కూల్మాన్పించి, ఇంట్లో టీచింగ్చెప్పిస్తున్నారు.
ఆన్లైన్ క్లాసులు పెట్టాలని..
పేరెంట్స్లో ఒమిక్రాన్ భయం మొదలైంది. కొన్ని స్కూళ్లు ఫిజికల్ క్లాస్లే చెప్తాం అంటుండగా, మరికొన్ని స్కూళ్లు ఆన్లైన్ క్లాసులకు ఒప్పుకోవడం లేదు. ఇంకొన్ని స్కూళ్లు ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాస్లు రెండు కండక్ట్ చేస్తున్నాయి. పేరెంట్స్లో చాలామంది ఏడో క్లాస్లోపు పిల్లలను స్కూల్ కు పంపేందుకు రెడీగా లేరు.
- వెంకట్ , జాయింట్ సెక్రటరీ, హైదరా బాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్
ముందు ముందు ఎలా ఉంటుందో..
ప్రస్తుతం అటెండెన్స్ కొంచెం తక్కువే ఉంది. తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుంచి టెన్త్ వరకు ఫిజికల్గా కండక్ట్ చేస్తున్నాం. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. - వీరయ్య, ప్రిన్సిపాల్, రవీంద్రభారతి స్కూల్.