జమున హేచరీస్‌కు నోటీసులు

జమున హేచరీస్‌కు నోటీసులు

బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూవివాదం విచారణను మళ్లీ తెరపైకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మెదక్ జిల్లా మాసాయిపేట్ లో ఈటల కుటుంబానికి చెందిన జమున  హేచరీస్ అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై మరోసారి నోటీసులు ఇచ్చింది డిప్యూటీ ఇన్సెపెక్టర్ ఆఫ్ సర్వే. దీనిపై జమున హేచరీస్ జూన్ లోనే నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఐతే అప్పట్లో కరోనా కారణంగా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో  ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు తిరిగి విచారణ చేస్తామని చెప్పారు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్.