హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల.. అమ్మకానికి మరో నోటిఫికేషన్

హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల..  అమ్మకానికి మరో నోటిఫికేషన్

రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోని భూముల వేలానికి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది HMDA. మూడు జిల్లాలోని 26 ల్యాండ్ పార్సిళ్లను అమ్మకానికి పెట్టనుంది.  రంగారెడ్డిలో 8, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 8, సంగారెడ్డి లో 10 ల్యాండ్ పార్సిళ్లను 2023 ఆగస్టు18న వేలానికి పెడుతోంది. 

బైరాగి గూడ, కోకాపేట, నల్లగండ్ల, మంచి రేవుల గండిపేట, బుద్వేల్, బాచుపల్లి, గండిమైసమ్మ దుండిగల్, చెంగిచర్ల, సూరారం, ఆర్సీ పురం, అమీన్ పూర్, నందిగామ, కృష్ణారెడ్డి పేట, పటాన్ చెరువు ప్రాంతాల్లోని భూములను అమ్మేయనుంది సర్కార్. 302 గజాల నుంచి 8 వేల 591 గజాల వరకు ఈ ప్లాట్లు ఉన్నాయి.

భూముల రిజిస్ట్రేషన్ కు ఈనెల 16 లాస్ట్ డేట్ ఉంది. EMD చెల్లింపు కోసం 17 లాస్ట్ డేట్ ఇచ్చింది HMDA. మొత్తం రెండు సెషన్లలో మూడు జిల్లాలోని భూముల వేలం చేపట్టనుంది. ఈ భూముల వేలంతో సర్కార్ కు భారీగా ఆదాయం సమకూరనుంది.