
వాట్సాప్లో కొత్తగా గ్రూప్ కాల్ అప్డేట్ రానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గ్రూప్ కాల్లో ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్ కాల్ని మ్యూట్ చేయొచ్చు. అంతేకాదు వాళ్లకు పర్సనల్గా మెసేజ్ కూడా పంపొచ్చు. గ్రూప్ కాల్ చేసినప్పుడు మాట్లాడడం అయిపోయాక కొందరు తమ కాల్ని మ్యూట్లో పెట్టడం మర్చిపోతారు. అప్పుడు గ్రూప్ అడ్మిన్తో పాటు గ్రూప్లోని ఎవరైనా వాళ్ల కాల్ని మ్యూట్లో పెట్టొచ్చు. మ్యూట్ ఆప్షన్ మీద నొక్కినప్పుడు మ్యూట్, మెసేజ్ ఆప్షన్లు కనిపిస్తాయి. కొత్త వెర్షన్ వాట్సాప్ ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.