కరెంట్ వైర్ల వెంబడి కేబుల్స్ ఉండొద్దు

కరెంట్  వైర్ల వెంబడి కేబుల్స్ ఉండొద్దు

హనుమకొండ సిటీ, వెలుగు: విద్యుత్​ లైన్ల వెంట కేబుల్, బ్రాడ్  బ్యాండ్  వైర్లు లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్​ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్టలోని కార్పొరేట్  ఆఫీస్​లో 16 సర్కిళ్ల పరిధిలోని కేబుల్, బ్రాడ్ బ్యాండ్  ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమపద్ధతిలో కేబుల్  వైర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆపరేటర్లు ఒకేలా కేబుల్  వైర్లను క్లిప్  చేసుకోవాలని సూచించారు. రోడ్  క్రాస్సింగ్స్  లేకుండా చూసుకోవాలని కోరారు. వినియోగంలో లేని వైర్లను 3 నెలల్లోగా తొలగించాలని ఆదేశించారు. డైరెక్టర్లు వి. తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు రాజు చౌహన్, అశోక్, చరణ్ దాస్,  కె.గౌతమ్ రెడ్డి,  పి.మధుసూదన్ రావు పాల్గొన్నారు.